నినాదం దినపత్రిక 23.7.2026 సౌజన్యంతో
తెలంగాణ సాహిత్యానికి శిఖరం దాశరథి
తెలంగాణ సాహిత్యానికి దాశరథి రచన శిఖరాయమాన స్థితిని కల్పించిందని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం దాశరథి కృష్ణమాచార్య 101 వ జయంతి కార్యక్రమాన్ని హెచ్ సియు, తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహించారు. దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ కోసం చేసిన ఉద్యమాన్నీ, ఆయన రచనలను వివరించి, ఆ కవిత్వంలో గల చైతన్యాన్ని ఆచార్య పిల్లలమర్రి రాములు వివరించారు. అనేక రచనల ద్వారా,ఉర్దూ అనువాదాల ద్వారా , యాత్రాస్మృతి లాంటి ఇతర రచనల ద్వారా దాశరథి కవితాశక్తిని,తెలుగు రాష్ట్రాల పోరాటపటిమను తెలుసుకోవచ్చుననీ, ఆయన రచనలు తెలుగులో ఉత్తమకవిత్వానికి నిదర్శనాలుగా నిలుస్తాయని, భారత స్వాతంత్ర్యం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రజలు పొందిన అనుభవాలను దాశరథి రచనల్లో చూడవచ్చుననీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దాశరథి పాటలను ఆచార్య పి.వారిజారాణి రాగయుక్తంగా వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వంగరి త్రివేణి దాశరథి కవిత్వం లోని విశేషాలను, ఆచార్య భూక్యాతిరుపతి, డా.పి.విజయ్ కుమార్, డా.బాశెట్టి లత తదితరులు దాశరథి కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ దినపత్రిక 23.7.2026 సౌజన్యంతో
ఆంధ్రజ్యోతి దినపత్రిక 23.7.2026 సౌజన్యంతో
దినపత్రిక 23.7.2026 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక 23.7.2026 సౌజన్యంతో
ఈనాడు దినపత్రిక 23.7.2026 సౌజన్యంతో
ప్రభంజనం దినపత్రిక 23.7.2026 సౌజన్యంతో
సభలో పాల్గొన్న ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు, పిల్లలమర్రి రాములు, వారిజారాణి, త్రివేణి, భూక్యా తిరుపతి, పి.విజయ్ కుమార్, బాశెట్టి లత









